విచ్చలవిడిగా అక్రమ నిర్మాణం

విచ్చలవిడిగా అక్రమ నిర్మాణం
Illegal ###construction rampant@@@

పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు
గ్రీవెన్స్ ఫిర్యాదులు బుట్టదాఖలు
వాయిస్ ఆఫ్ భారత్, మేడ్చల్ : విచ్చలవిడిగా అక్రమ నిర్మాణం జరుగుతున్న జీహెచ్ఎంసీ అధికారులు కండ్లు తెరవడం లేదు. గ్రీవెన్స్ లో కంప్లైట్ ఇచ్చినీ టౌన్ ప్లానింగ్ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం రామక్రిష్ణ కాలనీ, జయశంకర్ విగ్రహం వద్ద ఇంటి నెంబర్ 7-100/80 వద్ద జరుగుతున్న అనధికార నిర్మాణం అధికారుల చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో నిరాటంకంగా జరుగుతుంది. దీనికి ఎలాంటి అనుమతులు లేవు అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణంపై బీఆర్ కే బుట్టి మహర్ MAYS రాష్ట్ర అధ్యక్షుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని MAYS రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ కే బుట్టి మహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *