పెండింగ్ చలాన్ల గడువు పెంపు

పెండింగ్ చలాన్ల గడువు పెంపు

వాయిస్ ఆఫ్ భారత్ ( క్రైమ్ న్యూస్): పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో విధించిన గడువు బుధవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. బైక్, ఆటోలకు 80శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *