JOURNALIST TRAINING/ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, అలాగే మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలనే కీలక నిర్ణయాలను ప్రెస్ అకాడమీ ప్రకటించింది.తెలంగాణ మీడియా అకాడమీ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని అకాడమీ భవనంలో నిర్వహించగా, అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, ప్రభుత్వ సహకారంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘న్యూస్పేపర్స్ ఆర్కైవ్స్’ను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కె. ధర్మయ్య, ఐ అండ్ పీఆర్ శాఖ జాయింట్ డైరెక్టర్ డీఎస్. జగన్, డాక్టర్ సతీష్ కుమార్ తల్లాడి, డాక్టర్ యాదగిరి కంభంపాటి, దూరదర్శన్ కేంద్రం ప్రోగ్రామ్ ఇన్చార్జ్ పీవీ సత్యనారాయణ, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్స్ హెడ్ ఎస్. రమేష్ సుంకసారి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
ఇవే కాకుండా, చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి బీవీ కృష్ణాజీ రావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.
