ఇంటర్ ఫలితాల్లో గౌతమ్ కాలేజీ ప్రభంజనం
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలలో గౌతమ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఆడెపు సౌమ్య 993/1000, సెకండ్ ఇయర్ బైపీసీ పూజారి శరణ్య 993/1000, నాగపూరి హాసిని 990/1000, కందుల అభినయ 990/1000 మార్కులు సాధించారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో గజనవేణి సంజన 466/470, బండారి కావ్య 466/470, గజెల్లీ వైష్ణవి 466, బింగి శ్రావణి 466, వంగల శ్రావణి 465, ఫస్ట్ ఇయర్ బైపీసీలో సామల రుషిత 434/440, జూనియర్ సీఈసీలో తోడేటి శ్రీయుత్ 462/500 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు అభినదించారు. ఇంతటి ఘనవిజయానికి కారకులైన మా బోధన మా బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు గౌతమ్ కాలేజీ డైరెక్టర్స్ అంభీర శ్రీకాంత్, మంతెన భిక్షపతి, గొట్టె లక్ష్మణ్, బండి పరుశరామ్, అరెల్లి ధనుంజయ్, సందరాజు, సంతోష్ లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
