బ్యాంక్ దోపిడీ దొంగల అరెస్ట్
పోలీసులకు చిక్కిన ముఠా సభ్యులు
ముగ్గురి అరెస్ట్, పరారీలో మరో నలుగురు
రూ.13కోట్ల 61లక్షల విలువ సొత్తు స్వాధీనం
గత నెల 18న రాయపర్తి ఎస్ బీఐలో దోపిడీ
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : గత నెల 18వ తేది అర్ధరాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్ బీఐ బ్యాంక్లో దోపిడికీ పాల్పడిన ఉత్తరప్రదేశ్, మహరాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన నిందితుల నుంచి పోలీసులు సుమారు ఒక కోటి ఎనభై లక్షల నాలగు వేల రూపాయల విలువ గల 2 కిలోల 520 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, పదివేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్షాద్ అన్సారీ(34), షేహవాజ్పూర్, షాఖీర్ఖాన్ ఆలియాస్ బోలెఖాన్ (28), హిమాన్షు బిగాం చండ్ జాన్వర్ (30) లను ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ నవాబ్ హసన్ (39),అక్షయ్ గజానన్ అంబోర్ (24),సాగర్ భాస్కర్ గోర్ (32), సాజిద్ ఖాన్ (35) పరారీలో ఉన్నారు. ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులతో పాటు, పరారీలో మరో నలుగురు నిందితులు ఏడుగురు సభ్యులు ముఠా ఏర్పాడ్డారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్ కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉండే బ్యాంక్లు, బ్యాంక్ భద్రత ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. అనంతరం నిందితుడు ఉత్తర ప్రదేశ్, మహరాష్ట్రలకు చెందిన మిగితా నిందితులు కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. వ్యాపారం ముసుగులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా ముందుగా గుగూల్ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించడం జరిగింది. సేకరించిన సమచారంలో నిందితులు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్ బీఐ బ్యాంక్ చోరీ అనువైనదిగా గుర్తించి చోరీ చేసేందుకు ఈ ముఠా సిద్దపడింది. ఈ చోరీలో భాగంగా నవంబర్ 18న అర్ధరాత్రి తెలవారితే 19న నిందితులు హైదరాబాద్ నుంచి నిందితుల్లో ఒకడైన హిమాష్షు డ్రైవింగ్ చేస్తున్న ఒక కారులో రాయపర్తి గ్రామ శివారు ప్రాంతాన్ని చేరుకున్నారు. అనంతరం కారును తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు రమ్మని కారుని వెనక్కి తిప్పి పంపారు. అనంతరం మిగితా ఆరుగురు నిందితులో పంట పొలాల ద్వారా నిందితులు రాయపర్తి కేంద్రంలోని ఎస్ బీఐ బ్యాంక్ దక్షిణ భాగానికి రాత్రి 11 గంటలకు చేరుకొని అక్కడ ఉన్న కిటీకిని నిందితులు తొలగించి బ్యాంక్ లోనికి చొరబడిన ఈ ముఠా సభ్యులు ముందుగా బ్యాంక్ సెక్యూరీటీ అలారంతో పాటు, సీసీ కెమెరాల వైర్లను నిందితులు కట్ చేసి ఇద్దరు నిందితులను తొలగించిన కిటీకి వద్ద కాపలగా ఉంచారు. ప్రధాన నిందితుడితో సహ మరో నలుగురు నిందితులు బ్యాంక్ స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టి, స్ట్రాంగ్ రూంలో ఉన్న మూడు లాకర్లను ఈ ముఠా తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లను వినియోగించి లాకర్లను కట్ చేసి అందులో ఉన్న సూమారు రూ.13కోట్ల 61లక్షల విలువ గల బంగారు ఆభరణాలను వారి వెంట తెచ్చుకున్న సంచుల్లో వేసుకోని వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ ఇతర స్వామగ్రిని బ్యాంక్లో వదిలి వేయడంతో పాటు అక్కడి నుంచి వెళ్ళే ముందుగా సీసీ కెమెరాల సంబంధించిన డీవీఆర్ను ఈ ముఠా ఎత్తుకెళ్లారు. చోరీ అనంతరం నిందితులు వచ్చిన కారులో తిరిగి హైదరాబాద్ కిరాయి తీసుకున్న ఇంటికి చేరుకొని నిందితులు చోరీ సొత్తును ఏడు సమాన వాటాలు పంచుకున్నారు. నవంబర్ 19న నిందితులు మూడు బృందాలు వీడిపోయి మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్కు తిరిగివెళ్లిపోయారు.
అప్రమత్తమైన పోలీసులు..
ఈ భారీ చోరీపై అప్రమత్తమైన వరంగల్ కమిషనరేట్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ నేతృత్వంలకో వర్థన్నపేట ఏసీపీ నర్సయ్య, సీసీఎస్ ఏసీపీ భోజరాజు, నర్సంపేట ఏసీపీ కిరణ్కుమార్ల ఆధ్వర్యంలో పదికి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుల పట్టుకోవడ కోసం ఈ ప్రత్యేక పోలీస్ బృందాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టి నిందితుల కదలికలపై ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరించారు. ముగ్గురు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసి వారి నుండి చోరీ సోత్తున స్వాధీనం చేసుకోవడం జరిగింది.
కేసును చేధించిన పోలీసులను అభినందించిన సీపీ..

ఈ భారీ చోరీని అతి స్వల్పకాలంలో చేధించడంతో పాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవడం ప్రతిభ కనబరిచిన వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీలు నర్సయ్య, భోజరాజు, కిరణ్కుమార్, ఆత్మకూర్, రఘునాథ్పల్లి, సీసీఎస్, వర్థన్నపేట, పాలకుర్తి, నర్మెట్ట, టాస్క్ఫోర్స్, పోలీస్ కంట్రోల్ రూంకు చెందిన ఇన్ స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాసరెడ్డి, బాలాజీ వరప్రసాద్, శివకుమార్, రఘుపతి రెడ్డి, శ్రీనివాస్రావు, మహేందర్ రెడ్డి, అబ్బయ్య, పవన్కుమార్, విశ్వేశ్వర్, ఏఏఓ సల్మాన్పాషాతో పాటు ఎస్ఐలు, ఇతర దర్యాప్తు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
