పురస్కార గ్రహీతలకు కిషన్‌రెడ్డి అభినందనలు | kishanreddy BJP

పురస్కార గ్రహీతలకు కిషన్‌రెడ్డి అభినందనలు | kishanreddy BJP
పురస్కార గ్రహీతలకు కిషన్‌రెడ్డి అభినందనలు
VoiceofBharath (Business News) : దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలను అందించారుప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని మలయాళ నటుడు మోహన్‌లాల్‌ అందుకున్నారు. ఈ వేడుకలో షారుక్‌ ఖాన్‌ (‘జవాన్‌’) మరియు విక్రాంత్‌ మాస్సే (‘ట్వల్త్‌ ఫెయిల్‌’) ఉత్తమ నటులుగా, రాణీ ముఖర్జీ (‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’) ఉత్తమ నటిగా అవార్డులు స్వీకరించారుతెలుగు చిత్రాల విషయానికి వస్తే, ‘భగవంత్‌ కేసరి’ ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ‘హను-మాన్‌’ చిత్ర బృందం (దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సహా) ఉత్తమ ఏవీజీసీ విభాగంలో పురస్కారాలు అందుకుంది. ‘బలగం’ చిత్రంలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల శ్యామ్‌కుమార్‌ ఉత్తమ గేయ రచయితగా, ‘బేబి’ చిత్రం నుంచి పీవీఎన్‌ఎస్‌ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, సాయి రాజేశ్‌ నీలం ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా అవార్డులు స్వీకరించారు. ఈ విజేతలందరికీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
If you like this content  Please Subscibe our Website. for more updates follow our website : https://voiceofbharath.in

#NationalFilmAwards

#NationalFilmAwards71

#DadasahebPhalkeAward

#Mohanlal

#ShahRukhKhan

#VikrantMassey

#RaniMukerji

#Jawan

#12thFail

#MrsChatterjeeVsNorway

#BhagavanthKesari

#HanuMan

#Balagam

#BabyMovie

#PrashanthVarma

#KasarlaShyam

#PVNSRohith

#SaiRajeshNeelam

#Tollywood

#IndianCinema

#Awards

#Cinema

#TeluguCinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *